పవన్ కల్యాణ్ ర్యాలీలో అపశ్రుతి.. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
- తుపాను బాధిత రైతులను పరామర్శించిన పవన్
- జనసేన కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ
- ర్యాలీని ఢీకొట్టిన కారు
పెనమలూరుకు చెందిన అబ్దుల్ సుక్నబీ, పామర్రు మండలం జమీదగ్గుమిల్లికి చెందిన కేత పవన్జేత, తోట నరేంద్ర, పామర్రు శివారులోని శ్యామలాపురానికి చెందిన గుమ్మడి వంశీ గాయపడ్డారు. వీరిలో ఇద్దరిని విజయవాడ ఆసుపత్రికి తరలించగా, మరో ఇద్దరిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.