రైతుల నిరసనలు ఉద్ధృతం.. నోయిడా - ఢిల్లీ రహదారి మూసివేత!
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- చర్చలు అసంపూర్ణం కావడంతో ఉద్ధృతమైన రైతు నిరసనలు
- ప్రత్యామ్నాయ మార్గాల్లో ఢిల్లీకి వెళ్లాలన్న నోయిడా అధికారులు
నిన్న కేంద్ర మంత్రులతో రైతు సంఘాల ప్రతినిధులు జరిపిన సమావేశం విఫలం కావడం, ఎటువంటి నిర్ణయాలూ తీసుకోకుండా అసంపూర్ణంగా ముగియడంతో రైతులు ఈ ఉదయం తమ నిరసనల ఉద్ధృతిని మరింతగా పెంచారు.
దీంతో ఢిల్లీకి ప్రయాణించే నోయిడా వాసులు ప్రత్యామ్నాయంగా ఉన్న రహదారులపై ప్రయాణించాలని కాళింది కుంజ్ రహదారిని ఎంచుకోవాలని, చిల్లా మార్గంలో రావద్దని నోయిడా ట్రాఫిక్ పోలీసులు కోరారు.
కాగా, ఢిల్లీ - నోయిడా రహదారిపై పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన రైతులు టెంట్లు, వేసుకుని, అక్కడే వంటలు వండుకుని తింటూ తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీకి తూర్పున ఉన్న పంజాబ్, హర్యానా మార్గాల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది.