రైతులకు మాజీ క్రీడాకారుల మద్దతు.. పురస్కారాలు వెనక్కి!
- నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ రైతుల ఆందోళన
- ఈ నెల 5న రైతుల ఆందోళనలో పాల్గొననున్న మాజీ క్రీడాకారులు
- రాష్ట్రపతి భవన్ వెలుపల పురస్కారాలను వదిలిపెట్టనున్న వైనం
ఇందులో భాగంగా గతంలో తాము అందుకున్న పురస్కారాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు. అర్జున అవార్డు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కర్తార్ సింగ్; అర్జున అవార్డు గ్రహీత, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు సజ్జన్ సింగ్ చీమా; అర్జున అవార్డు గ్రహీత, హాకీ క్రీడాకారుడు రాజ్బీర్ కౌర్ తదితరులు ఈ నెల 5న రైతుల ఆందోళనలో పాల్గొని, రాష్ట్రపతి భవన్ బయట తమ పురస్కారాలను వదిలిపెట్టాలని నిర్ణయించారు.