నీటి పొదుపుతో పంటలు.. ‘అనంత’ రైతుకు అంతర్జాతీయ పురస్కారం

Anantapur farmer got international best farmer award
  • సాగునీటి పొదుపుతో పంటలు పండిస్తున్న శివశంకర్‌రెడ్డి
  • దేశం నుంచి ఎంపికైన ఒకే ఒక్క రైతు
  • పురస్కారాలను ప్రకటించిన ఐసీఐడీ
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన మేకల శివశంకర్‌రెడ్డికి ఉత్తమ రైతుగా అంతర్జాతీయ పురస్కారం దక్కింది. ఈ మేరకు అంతర్జాతీయ సాగునీటి, డ్రైనేజీ కమిషన్ (ఐసీఐడీ) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది.

సాగునీటి పొదుపుతో పంటలు పండించడంలో ఆదర్శంగా నిలిచినందుకు గాను ఆయనను ఈ అవార్డు వరించింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఐసీఐడీలో సాగునీటి రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్నారు. అంతర్జాతీయస్థాయిలో పనిచేస్తున్న ఈ సంస్థ వ్యవసాయంలో నీటి నిర్వహణ, పొదుపుపై వర్షాధార రైతులను ప్రోత్సహిస్తోంది.

ఈ నేపథ్యంలో బిందు, తుంపర్ల సేద్యం ద్వారా ఎరువుల వినియోగంతో దానిమ్మ, ద్రాక్ష పంటలు పండిస్తూ అత్యధిక దిగుబడులు సాధించినందుకు గాను శివశంకర్‌రెడ్డికి ఈ అవార్డు దక్కింది. ఐసీఐడీ మొత్తం నాలుగు పురస్కారాలను ప్రకటించగా, భారత్ నుంచి శివశంకర్‌రెడ్డి మాత్రమే ఎంపిక కావడం విశేషం. మిగతా మూడు పురస్కారాలు ఇరాన్‌కు దక్కడం గమనార్హం.
Go Back to Shorts
Andhra Pradesh
Anantapur District
farmer
ICID

More Telugu News