దేశ వ్యాప్తంగా మొదలైన సార్వత్రిక సమ్మె... మద్దతు పలికిన టీఆర్ఎస్!

Strike Started in india
  • సమ్మెలో భాగమైన 25 కోట్ల మంది
  • బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
  • కేంద్ర సంస్థల ప్రైవేటీకరణను అంగీకరించబోమన్న టీఆర్ఎస్
దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మె ఈ ఉదయం ప్రారంభమైంది. దాదాపు 25 కోట్ల మంది సమ్మెలో భాగం కానున్నారని ఇప్పటికే కార్మిక యూనియన్లు వెల్లడించగా, బ్యాంకింగ్, రిజిస్ట్రేషన్, నిత్యావసరాల పంపిణీ తదితర సేవలపై ప్రభావం పడుతుందని అంచనా. ఇక ఈ సమ్మెకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు పలికింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడాన్ని తాను అంగీకరించబోమని వ్యాఖ్యానించిన మంత్రి హరీశ్ రావు, వాటిని కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమాలకు తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని అన్నారు. తెలంగాణలో ఈ సమ్మె టీయూడబ్ల్యూజే, ఐజేయూ (ఇండియన్ జర్నలిస్ట్స్ యూనినియన్), తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ సంయుక్త కార్యాచరణ కమిటీలతో పాటు బీహెచ్ఈఎల్, బీడీఎల్ తదితర పలు కంపెనీల కార్మిక సంఘాలు మద్దతు పలికాయి.
Go Back to Shorts
TRS
Strike
India
Unions

More Telugu News