బీజేపీ నేతలను నిద్రలేపి అడిగితే వాళ్లు చెప్పే పేర్లలో నా పేరు కచ్చితంగా ఉంటుంది: ఒవైసీ
- త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు
- వరద బాధితులకు మోదీ సర్కారు ఏమీచేయలేదన్న ఒవైసీ
- మతం పేరుతో ఓట్లకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు
ఇటీవలి వరదలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైందని, వరదలతో తల్లడిల్లిపోయిన నగర ప్రజలకు మోదీ సర్కారు చేసిందేమీ లేదని అన్నారు. హైదరాబాదుకు బీజేపీ ఏమీ చేయలేదు కాబట్టే ఇప్పుడు మతం పేరుతో ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఎత్తులు ఇక్కడ పనిచేయవని, నగర ప్రజలకు ఎవరు ఎలాంటివారో తెలుసని ఒవైసీ స్పష్టం చేశారు. అసలు, బీజేపీ నేతలు హైదరాబాదుకు ఏంచేశారో చెప్పాలని నిలదీశారు.