బీజేపీ ఆడని అబద్ధం, చేయని అసత్య ప్రచారం ఉండదు, జాగ్రత్త: నేతలతో కేసీఆర్
- ప్రశాంతమైన హైదరాబాద్ కావాలో, అల్లర్ల హైదరాబాద్ కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారు
- పేదలకు చేస్తున్న సాయాన్ని బీజేపీ అడ్డుకుంది
- అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ నేతలకు దిశానిర్దేశం
నగరంలోని వరద బాధితులందరికీ సాయం అందిస్తామని చెప్పారు. పేదలను బీజేపీ ఆదుకోకపోవడమే కాకుండా, తాము ఇస్తున్న వరద సాయాన్ని ఆపేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బీజేపీ ఆడని ఆబద్ధం, చేయని దుష్ప్రచారం అంటూ లేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ అదే చేస్తుందని, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని నేతలకు కేసీఆర్ సూచించారు.