రాష్ట్ర ప్రజల కోసం కొరడా దెబ్బలు తిన్న చత్తీస్ గఢ్ సీఎం
- దుర్గ్ జిల్లాలో గోవర్థన్ పూజ
- ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్న సీఎం భూపేశ్ బాఘేల్
- చేతిపై కొరడాతో కొట్టించుకున్న వైనం
చత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లా జజంగీర్ గ్రామంలో గోవర్ధన్ పూజ (గౌరా గౌరి పూజ) జరిగింది. ఈ పూజలో పాల్గొని కొరడాతో కొట్టించుకుంటే కోరినది జరుగుతుందని ఓ నమ్మిక. దాంతో కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా దీవించాలంటూ చేతిపై కొరడాతో కొట్టించుకున్నారు. చత్తీస్ గఢ్ లో ప్రతి ఏటా దీపావళి అనంతరం ఈ గోవర్ధన్ పూజ నిర్వహించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. ఏదేమైనా ప్రజల కోసం దెబ్బలు తిన్న సీఎం భూపేశ్ బాఘేల్ నిజంగా అభినందనీయుడు.