అసంపూర్తిగా ముగిసిన విచారణ.. అర్నాబ్కు దక్కని ఊరట!
- 2018 నాటి కేసులో అరెస్ట్ అయిన అర్నాబ్ గోస్వామి
- సమయాభావం వల్ల ఇతర పార్టీల వాదనలు వినలేకపోయిన కోర్టు
- విచారణ నేటికి వాయిదా
ఆర్కిటెక్చర్-ఇంటీరియర్ డిజైనర్ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ల ఆత్మహత్యల కేసులో అర్నాబ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం ఈ కేసును మూసివేసినప్పటికీ, బాధిత కుటుంబ సభ్యుల అభ్యర్థనతో ఉద్ధవ్ ప్రభుత్వం కేసును తిరిగి తెరిచింది. అర్నాబ్ను బుధవారం అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది. అర్నాబ్ ప్రస్తుతం కోవిడ్ సెంటర్గా మార్చిన రాయ్గడ్లోని జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్నారు.