అట్రాసిటీ కేసును వెనక్కి తీసుకోలేమన్న పోలీసులు.. మంగళగిరి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
- అమరావతిలో మూడు రాజధానులకు అనుకూలంగా స్థానిక ఎస్సీల దీక్షలు
- వారిని అడ్డుకున్న మరికొందరు ఎస్సీలు, బీసీలు
- ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
అయితే ఆ తర్వాత కేసును వెనక్కి తీసుకునేందుకు వారు సమ్మతించినా... పోలీసులు మాత్రం తిరస్కరించారు. ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు స్పష్టం చేస్తారు. దీంతో ఎస్సీ సంఘాల నేతలు, టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. కనీస విచారణ కూడా జరపకుండానే ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన డీఎస్పీ దుర్గాప్రసాద్ వాహనాన్ని చుట్టుముట్టారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద ఆందోళనకు దిగారు.