బోర్డర్ లో పాకిస్థాన్ డ్రోన్ ను కూల్చేసిన భారత సైన్యం
- కుప్వారా జిల్లాలో ఈ ఉదయం కూల్చివేత
- చైనా తయారీ డ్రోన్ ను పంపించిన పాకిస్థాన్
- ఉగ్రవాదులను పంపేందుకు పాక్ యత్నిస్తోందన్న ఆర్మీ అధికారులు
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఈ ఉదయం 8 గంటల సమయంలో ఈ డ్రోన్ ను కూల్చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులు మాట్లాడుతూ, పాక్ చర్యలను అడ్డుకోవడానికి సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. చలికాలంలో ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తుందని... అందుకే ఈలోగానే ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ డ్రోన్ ను చైనా కంపెనీ డీజేఐ తయారుచేసిందనీ, దాని పేరు మావిక్-2 ప్రో అని చెప్పారు.