Manchireddy Kishan Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డికి చేదు అనుభవం

షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఊహించని పరాభవం ఎదురైంది. ఆయన వాహనంపై జనాలు చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే వర్షాల కారణంగా నిండిన చెరువుకు పూజ చేసేందుకు రంగారెడ్డి జిల్లా యాచారం మేడిపల్లికి ఆయన వెళ్లారు.

 ఈ సందర్భంగా ఆయనను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఫార్మా సిటీ కోసం చేస్తున్న భూసేకరణను వెంటనే ఆపేయాలని వారు డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీల కోసం తాము భూములు కోల్పోతుంటే కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఈ సందర్భంగా స్థానికులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు మంచిరెడ్డి యత్నిస్తుండగా... ఆయన వాహనంపై చెప్పులు, రాళ్లను రైతులు విసిరారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.
Go Back to Shorts
Manchireddy Kishan Reddy
TRS
Ranga Reddy District
Shoe
Chappals

More Telugu News