యూపీలో పరువు హత్య: 16 ఏళ్ల బాలికను అతి దారుణంగా చంపేసిన తండ్రి, సోదరుడు

murder in up
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో కొన్ని రోజుల క్రితం ఓ యువతి హత్యాచారానికి గురైన ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఆ ఘటనను మరవకముందే అదే రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల దళిత బాలిక పరువు హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. ఆ బాలికను తండ్రి, సోదరుడే తీవ్రంగా హింసించి గొంతు కోసి చంపేశారు.

అనంతరం బాలిక తలను శరీరం నుంచి వేరుచేసి ఖననం చేశారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు తెలిపారు. షాజహాన్‌పూర్‌ జిల్లాలో ఓ బాలిక పెళ్లి కాకుండా గర్భం దాల్చింది. దీంతో గ్రామంలో ఆమె కారణంగా తమ పరువుపోతోందని ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి, సోదరుడు కలసి బాలికను దారుణంగా హత్య చేసి, ఖననం చేశారు.

గత నెల  23న ఆ బాలిక అదృశ్యమైందని, అయినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహం లభ్యం కావడంతో కేసును ఛేదించామని చెప్పారు. ఆ బాలిక తండ్రి నేరాన్ని అంగీకరించాడని, ఆమె సోదరుడు పరారీలో ఉన్నాడని వివరించారు. మైనర్‌ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరమని, ఆమెకు గర్భం రావడానికి బాధ్యుడైన వారిని పట్టుకుంటామని చెప్పారు.
Go Back to Shorts
Uttar Pradesh
Crime News
India

More Telugu News