Telangana: లక్షా తొంబై తొమ్మిది వేలు దాటిన తెలంగాణ కరోనా కేసులు!

Above 1900 New Cases in Telangana
  • శనివారం నాడు 51,623 మందికి పరీక్షలు
  • 1,949 కొత్త కేసులు
  • రాష్ట్రంలో 27,901 యాక్టివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 51,623 మంది నమూనాలను పరీక్షించగా, 1,949 మందికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,99,276కు చేరుకుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన గణాంకాల మేరకు శనివారం నాడు కరోనాతో 10 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 1,163కు చేరింది. శనివారం నాడు వ్యాధి నుంచి 2,366 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,70,212కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 27,901 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 22,816 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వైద్యుల సలహాతో చికిత్స తీసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ఇక, ఇప్పటివరకూ రాష్ట్రంలో 32 లక్షలకు పైగా కరోనా టెస్ట్ లను నిర్వహించామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా వచ్చిన కేసుల్లో జీహెచ్ ఎంసీ పరిధిలో 291 కేసులు ఉండటం గమనార్హం.

.
Telangana
Corona Virus
New Cases

More Telugu News