డేంజర్ బెల్స్.. లక్షణాలు లేని కరోనా రోగులతో చాలా ప్రమాదం: తాజా అధ్యయనం
- అసింప్టమాటిక్ రోగుల్లో వైరస్ లోడు ఎక్కువ
- సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ సర్వేలో వెల్లడి
- 95 శాతం మంది రోగుల్లో 20 బిక్లేడ్ స్టెయిర్ వైరస్
అసింప్టమాటిక్ రోగుల్లో వైరస్ లోడు అధికంగా ఉండడంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా అదే స్థాయిలో ఉండడంతో వారంతా ఆరోగ్యంగా ఉన్నట్టు బయటకు కనిపిస్తుంటారని ఈ సర్వేలో తేలింది. వీరి నుంచి ఇమ్యూనిటీ స్థాయులు తక్కువగా ఉన్న వారికి వైరస్ సోకి వారి మరణానికి కారణమవుతున్నట్టు సర్వే గుర్తించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో తీసుకుంటే 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. మిగతా 30 శాతం మందిలోనే కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తున్నాయి. వైరస్ లోడు ఎక్కువగా ఉండే అసింప్టమాటిక్ రోగుల నుంచి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారితోపాటు పిల్లలు, వృద్ధులకు సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. పరోక్షంగా వారి మరణానికి కారణమవుతున్నట్టు పేర్కొన్నారు.