వ్యవసాయ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో తీవ్ర దుమారం
- రాజ్యసభలో నూతన వ్యవసాయ బిల్లుపై చర్చ
- ముసాయిదా ప్రతులు చించిన తృణమూల్ సభ్యుడు
- నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్, మిత్ర పక్షాల సభ్యులు
మరోవైపు ఆప్, శిరోమణి అకాలీదళ్ సభ్యులతో పాటు తృణమూల్ సభ్యులు మైకులు విరిచేందుకు ప్రయత్నించారు. రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్, ఇతర పక్షాలు బిగ్గరగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా రాజ్యసభ ఓసారి వాయిదా పడినా, తిరిగి ప్రారంభమైన సమయంలో మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లుకు ఆమోదం లభించింది. దాంతో సభ సోమవారానికి వాయిదాపడింది.