మోదీ పుట్టిన రోజు వేడుకలు చేస్తుంటే ప్రమాదం... వీడియో ఇదిగో!
- చెన్నైలో కార్యకర్తల ఉత్సాహం
- హీలియం బెలూన్లను తాకిన బాణాసంచా
- డజను మందికి పైగా గాయాలు
"ఈ ప్రమాదంలో డజను మందికి పైగా గాయపడ్డారు. గాయాలన్నీ చిన్నచిన్నవే. ఎవరికీ ప్రాణాపాయం లేదు. హీలియం నింపిన బెలూన్లకు బాణాసంచా తగలడమే ఈ ప్రమాదానికి కారణం" అని తమిళనాడు బీజేపీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ బెలూన్లలో ఏ వాయువును నింపారో తమకు తెలియదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని, భౌతిక దూరాన్ని పాటించలేదని కేసు పెట్టి, విచారిస్తున్నామని అన్నారు.