డ్రగ్స్ కేసులో కన్నడ స్టార్ కపుల్ కు సమన్లు.. పరారీలో మాజీ మంత్రి కుమారుడు!
- కన్నడ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం
- దిగంత్, ఐంద్రితలకు సీసీబీ సమన్లు
- పరారీలో మాజీ మంత్రి కుమారుడు ఆదిత్య అల్వా
ఈ కేసులో కీలక నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలోని ఐ బార్టనే అనే క్యాసినోకు వీరిని ఆహ్వానించిన వీడియో వైరల్ అవుతోంది. దీని ఆధారంగా వీరికి సమన్లు జారీ అయ్యాయి. మరోవైపు కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్యపై కేసు నమోదైంది. ఆయనకు చెందిన రిసార్ట్ పై ఈ ఉదయం సీసీబీ పోలీసులు రెయిడ్ చేశారు. అయితే ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.