బీహార్ ఎన్నికల వాయిదాకు నిరాకరణ.. జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు!
- కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ పిటిషన్
- సీఈసీని తాము ఆదేశించలేమన్న సుప్రీంకోర్టు
- అన్ని విషయాలను సుప్రీం పరిగణలోకి తీసుకుంటుందని వ్యాఖ్య
అన్ని విషయాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంటుందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కోవిడ్ కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని తాము ఆదేశించలేమని తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారాల్లో తాము ఎలా జోక్యం చేసుకోగలమని ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణపై సీఈసీదే తుది నిర్ణయమని తెలిపింది. మరోవైపు బీహార్ ఎన్నికలు అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో జరిగే అవకాశం ఉంది.