COVID-19: తెలంగాణలో మరో 2,579 మందికి సోకిన కరోనా

new 2579  coronavirus cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,670
  • ఆసుపత్రుల్లో 23,737 మందికి చికిత్స
  • 84,163 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 770  
తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా  2579  మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అదే సమయంలో 9 మంది  కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1752   మంది కోలుకున్నారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,670కి చేరింది. ఆసుపత్రుల్లో 23,737 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 84,163 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 770కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 295 మందికి కొత్తగా కరోనా సోకింది.                
                                 
COVID-19
Corona Virus
Telangana

More Telugu News