కేంద్రమే ఆ మాట అనడం ఎంతో బాధ కలిగించింది: రఘురామకృష్ణరాజు
- ఢిల్లీలో రఘురామ మీడియా సమావేశం
- ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వానిదే హక్కు అని పేర్కొన్న కేంద్రం
- కేంద్రం కౌంటర్ లో కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయన్న రఘురామ
రాష్ట్రం తీసుకువచ్చిన సీఆర్డీయే రద్దు చట్టం గురించి తమకు చెప్పలేదన్న నిజాన్ని కేంద్రం వెల్లడించిందని, చెప్పివుంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకుని ఉండేదోనని వ్యాఖ్యానించారు. అందరికీ చెప్పే చేస్తున్నామన్న ఏపీ సర్కారు మరోసారి పచ్చి అబద్ధం చెప్పినట్టు నిరూపితమైందన్నారు. అంతేకాకుండా, కేంద్రం తన కౌంటర్ లో రాజధాని అని మాత్రమే పేర్కొందని, రాజధానులు అని ప్రస్తావించలేదని తెలిపారు. ఈ సందర్భంగా ఓ పాత సామెత చెప్పిన రఘురామ ఓ సామాజిక వర్గంపై అసహనం వ్యక్తం చేశారు.