Corona Virus: దేశంలో ఒక్కరోజులో కరోనాతో 1,007 మంది మృతి

Single day spike of 62064 corona cases
  • 24 గంటల్లో భారత్‌లో 62,064 మందికి కరోనా 
  • కేసుల సంఖ్య మొత్తం 22,15,075
  • మృతుల సంఖ్య మొత్తం 44,386
  • 6,34,945  మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
భారత్‌లో కరోనా కేసులు, మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 62,064 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 1,007 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 22,15,075కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 44,386కి పెరిగింది. 6,34,945  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 15,35,744 మంది కోలుకున్నారు.
                               
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,45,83,558 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 4,77,023 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.
Corona Virus
COVID-19
India

More Telugu News