శ్మశానం నుంచి ఏడుపు... శిశువును వెలికితీసిన గ్రామస్థులు!

Baby Crying in Soil Rescued
  • ఝార్ఖండ్ లోని లోహర్ దగా జిల్లాలో ఘటన
  • పిల్లాడి ఏడుపు విని గ్రామస్తులకు చెప్పిన వ్యక్తి
  • బాలుడిని వెలికి తీసిన యువకులు
బతికున్న శిశువును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పైపైన పాతిపెట్టి వెళ్లిపోగా, ఆ బాలుడు ఏడుస్తూ, తన ఉనికిని బహిర్గతం చేసిన వింతైన ఘటన ఝార్ఖండ్ లోని లోహర్ దగా జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కుడు పోలీసు స్టేషన్ ప్రాంతంలోని ఓ శ్మశానం వద్ద గడ్డి కోసుకునేందుకు వెళ్లిన ఓ మహిళకు శిశువు ఏడుపు వినిపించింది. పరిశీలించి చూడగా, పైపైన కప్పెట్టిన ఓ ప్రదేశంలో శిశువు ఏడుపు వినిపించింది.  

ఈ విషయాన్ని ఆమె వెంటనే ఊరి ప్రజలకు తెలియజేసింది. అందరూ అక్కడికి వచ్చి, ఏడుపు వినిపిస్తున్న ప్రాంతంలో వెలికితీయగా, అప్పుడే పుట్టిన ఓ శిశువు కనిపించాడు. ఆ పిల్లాడు క్షేమంగానే ఉన్నాడని గుర్తించిన స్థానికులు అతనికి ఒక మహిళ వద్ద తల్లి పాలు పట్టించారు. ఈ పిల్లాడిని పెంచుకుంటామంటూ పలువురు దత్తత తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఈలోగా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, అక్కడికి వచ్చి, శిశువును ఆసుపత్రికి తరలించి, అతని తల్లిదండ్రులు ఎవరన్న విషయంపైనా, ఎవరు పాతిపెట్టారన్న విషయంపైనా దర్యాఫ్తు మొదలు పెట్టారు.
Go Back to Shorts
Child
Jharkhand
Earth

More Telugu News