కేరళలో కుండపోత వర్షాలు... వరద భయంతో హడలిపోతున్న జనం!
- భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు
- ఇడుక్కి, మళప్పురం జిల్లాల్లో రెడ్ అలెర్ట్
- మున్నార్ సమీపంలో విరిగిపడిన కొండచరియలు
- ఐదుగురి మృతి
కాగా, ఇడుక్కి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మున్నార్ సమీపంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించారు. అనేక ప్రాంతాల్లో వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కాదు, కమ్యూనికేషన్ వ్యవస్థలు సైతం పనిచేయడంలేదు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో స్థానిక బలగాలకు తోడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.