Karnataka: కర్ణాటక సీఎం యడియూరప్ప కుమార్తెకూ సంక్రమించిన కరోనా

Karnataka CM BS Yediyurappa daughter tests positive for Covid
  • సీఎంకు కరోనా సోకిన గంటలైనా గడవకముందే కుమార్తెకూ నిర్ధారణ
  • తండ్రి, కుమార్తె ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో చికిత్స
  • గత నెల మొదట్లో సీఎం క్యాంపు కార్యాలయ ఉద్యోగికి కరోనా
తనకు కరోనా సోకిందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించి గంటలైనా గడవకముందే ఆయన కుమార్తె కూడా కరోనా బారినపడ్డారు. ఆ వెంటనే ఆమె బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. సీఎం కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 సీఎం ఆరోగ్యంగా ఉన్నారని, నిపుణుల బృందం ఆయనను దగ్గరుండి పర్యవేక్షిస్తోందని మణిపాల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. యడియూరప్పకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించగా కుమార్తెకు వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. కాగా, గత నెల మొదట్లో సీఎం క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి కూడా కరోనా బారినపడ్డారు.
Karnataka
Yediyurappa
Corona Virus
Yediyurappa daughter

More Telugu News