Telangana: 5వ తేదీన టీఎస్ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

  • 5వ తేదీ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో కేబినెట్ భేటీ
  • కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
  • సెక్రటేరియట్ భవన నిర్మాణంపై చర్చించనున్న కేబినెట్
TS Cabinet to meet on Aug 5

ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి మంత్రులు, సీఎస్, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా కరోనా మహమ్మారి నియంత్రణపై ఎక్కువ దృష్టి సారించనున్నారు. కరోనా నేపథ్యంలో, విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా విశ్లేషించనున్నారు. సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణంపై చర్చించనున్నారు. నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయంతో పాటు పలు అంశాలపై చర్చలు జరపనున్నారు.

  • Loading...

More Telugu News