ఏ వేడుక జరిగినా పార్వతీ పరమేశ్వరుల్లా వచ్చేవారు: రావి కొండలరావు మృతిపై చిరంజీవి స్పందన
- నటుడు రావి కొండలరావు మృతి
- పెద్ద దిక్కును కోల్పోయామన్న చిరంజీవి
- కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
రావి కొండలరావు, ఆయన సతీమణి రాధాకుమారి అనేక చిత్రాల్లో కలిసి నటించారని, చిత్ర పరిశ్రమలో ఏ వేడుక జరిగినా పార్వతీ పరమేశ్వరుల్లా ఇద్దరూ కలిసి వచ్చి అభినందనలు, ఆశీస్సులు అందజేయడం చూడముచ్చటగా ఉండేదని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. రావి కొండలరావు మరణంతో చిత్రసీమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.