అప్పుడు ఆయనకు వచ్చిన పరిస్థితే ఇప్పుడు నాకొచ్చింది: రఘురామకృష్ణరాజు
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణరాజు
- అప్పట్లో జగన్ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారని వెల్లడి
- రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదన్నారని వివరణ
ప్రభుత్వాలు మారినా పోలీసులు వారే ఉంటారని, అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ కూడా పోలీసులపై నమ్మకం లేదన్నారని, అప్పుడు ఆయనకు వచ్చిన పరిస్థితే ఇప్పుడు తనకు వచ్చిందని భావిస్తున్నానని రఘురామకృష్ణరాజు తెలిపారు. కాగా, తాను కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, దానిపై ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగిందని వెల్లడించారు. ఐబీ నివేదికలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పిందని, రెండు వారాల్లోగా ఐబీ నివేదికలన్నీ పరిశీలించి త్వరితగతిన పరిష్కరించండి అంటూ హైకోర్టు కేంద్రానికి నిర్దేశించిందని రఘురామకృష్ణరాజు వివరించారు.