Corona Virus: దేశంలో ఒక్కరోజులో 34,884 మందికి సోకిన కరోనా

Spike of 34884 cases and 671 deaths reported in India in the last 24 hours
  • ఒక్క రోజులో 671 మంది మృతి
  • ఇప్పటివరకు మొత్తం 10,38,716 కేసులు
  • మృతుల సంఖ్య మొత్తం 26,273
  • 3,58,692 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో భారత్‌లో 34,884 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 671 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 10,38,716కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 26,273కి పెరిగింది. 3,58,692 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 6,53,751 మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,34,33,742 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,61,024 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID-19
India

More Telugu News