మరోసారి చొరవ చూపిన తెలంగాణ గవర్నర్... మరిన్ని వెంటిలేటర్లు పంపాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి
- ఈఎస్ఐకి టెస్టింగ్ కిట్లు కోరిన తమిళిసై
- రోజుకు 3 వేల టెస్టులు చేసే యంత్రాన్ని ఇస్తామన్న కేంద్రమంత్రి
- కృతజ్ఞతలు తెలిపిన తమిళిసై
ఈ క్రమంలో ఆమె కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ తో మాట్లాడారు. ఈఎస్ఐకి మరిన్ని వెంటిలేటర్లు, కరోనా టెస్టింగ్ కిట్లు కావాలని అడిగారు. తమిళిసై విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. అంతేకాదు, రోజుకు 3 వేల టెస్టులు చేసే యంత్రాన్ని కూడా తెలంగాణకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో తమిళిసై కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.