Corona Virus: దేశంలో ఒక్కరోజులో 14,933 మందికి కొత్తగా కరోనా సోకిన వైనం

Coronavirus Over 14000 deaths in India
  • కరోనా కేసుల సంఖ్య మొత్తం 4,40,215
  • మృతుల సంఖ్య మొత్తం 14,011
  • 1,78,014 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 2,48,190 మంది
భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 14,933 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 312 మంది మరణించారు.
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 4,40,215కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 14,011కి పెరిగింది. 1,78,014 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,48,190 మంది కోలుకున్నారు.
Corona Virus
COVID-19
India

More Telugu News