‘రౌడీబేబీ’పై కేసు నమోదు.. ఆత్మహత్యాయత్నం చేసిన టిక్టాక్ స్టార్
- ఇటీవలే సింగపూర్ వెళ్లొచ్చిన సుబ్బులక్ష్మి
- విలేకరిని అసభ్యపదజాలంతో దూషించడంతో కేసు నమోదు
- ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం
అంతేకాదు, ఓ విలేకరిని అసభ్య పదజాలంతో తిట్టిపోసింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు కావడంతో మనస్తాపం చెందిన ‘రౌడీబేబీ’ నిన్న ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.