అంబులెన్సుల కుంభకోణాన్ని సాక్ష్యాలతో బయటపెట్టాం: దేవినేని ఉమ
- తప్పుడు ఆరోపణలతో మా నాయకులను అరెస్టులు చేస్తున్నారు
- 108 అంబులెన్సుల నిర్వహణలో రూ.300 కోట్ల కుంభకోణం
- ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకి చెప్పండి
'తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి మా నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. 108 అంబులెన్సుల నిర్వహణలో రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందని సాక్ష్యాల సహా బయటపెట్టాం. బాధ్యులయిన మీ పార్టీ నాయకుల మీద, వారి బంధువుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారు' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.