చైనాతో ఉద్రిక్తతలపై.. ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు

Narendra Modi has called for an all party meeting at 5 PM on 19th June
  • భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు
  • ఇప్పటికే పలువురితో మోదీ చర్చ
  • దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో మాట్లాడనున్న మోదీ
  • శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌
భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. ఈ క్రమంలో తూర్పు లడఖ్‌లోని గాల్వన్ ‌లోయ వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలపై మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులతో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు. కాగా, గాల్వన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇరు దేశాలు పెద్ద సంఖ్యలో తమ సైన్యాన్ని సరిహద్దుల వద్దకు తరలిస్తున్నాయి.

Go Back to Shorts
Narendra Modi
BJP
India
China

More Telugu News