Corona Virus: భారత్‌లో ఒక్కరోజులో కరోనాతో 2003 మంది ప్రాణాలు కోల్పోయిన వైనం

2003 deaths 10974 new cOVID19 cases in the last 24 hours
  • గత 24 గంటల్లో దేశంలో 10,974 మందికి కరోనా
  • కేసుల సంఖ్య మొత్తం 3,54,065
  • మృతుల సంఖ్య మొత్తం 11,903
  • 1,55,227 మందికి ఆసుపత్రుల్లో చికిత్స  
దేశంలో కొవిడ్‌-19‌ కేసులు, మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 10,974 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 2,003 మంది మరణించారు.
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,54,065కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 11,903కు పెరిగింది. 1,55,227 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,86,935 మంది కోలుకున్నారు.
Corona Virus
COVID-19
India

More Telugu News