సడలింపులు ఇచ్చినా ఆదాయం పెరగలేదు.. ఏడాదికి రూ. 37,400 కోట్లను కిస్తీలుగా కట్టాలి: కేసీఆర్
- రాష్ట్రానికి ఆదాయం పడిపోయింది
- అప్పులను రీషెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదు
- 12 కిలోల బియ్యం ఈ నెల కూడా ఇస్తాం
అప్పులపై వడ్డీలను యథావిధిగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ చెప్పారు. పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఈ నెల కూడా ఇస్తామని చెప్పారు. లాక్ డౌన్ సడలింపుల వల్ల కూలీలు, కార్మికులకు మళ్లీ పని లభిస్తుందని అన్నారు.
కరోనాతో ఉపాధి కోల్పోయిన పేదలకు రూ. 1500 ఇచ్చే కార్యక్రమం ఇకపై కొనసాగదని కేసీఆర్ చెప్పారు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, అఖిల భారత సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను కొనసాగించనున్నట్టు తెలిపారు.