లాక్డౌన్ పొడిగింపుకే కేసీఆర్ మొగ్గు.. ప్రారంభమైన సమీక్ష సమావేశం
- పరిమిత ఆంక్షలతో కర్ఫ్యూను కూడా పొడిగించే యోచన
- రాష్ట్రవ్యాప్తంగా మరిన్న సడలింపులు
- సమావేశానంతరం పూర్తిస్థాయి వేతనాలపై స్పష్టత
నిజానికి ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ సడలింపులు ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఈ నెల 31తో రాష్ట్రంలో లాక్డౌన్ ముగియనుండగా, మరిన్ని రోజులు దానిని కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాత్రిపూట అమలు చేస్తున్న కర్ఫ్యూను పరిమిత ఆంక్షలతో ఇంకొన్ని రోజులు కొనసాగించాలన్నది కూడా ప్రభుత్వ నిర్ణయమని చెబుతున్నారు. అలాగే, ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.