హైదరాబాద్లో కరోనా బారిన పడిన సీఐ, ఎస్సై,కానిస్టేబుల్!
- వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపడంలో సీఐ కీలక పాత్ర
- 30 మంది నుంచి నమూనాల సేకరణ
- పోలీసుల కుటుంబాలు గాంధీకి తరలింపు
సీఐకి కరోనా సోకిందన్న విషయం తెలియగానే అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నలుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు కలిపి మొత్తం 30 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో కొందరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అలాగే, గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించిన ఎస్సై, కానిస్టేబుల్కు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా సోకిన పోలీసుల కుటుంబాలను గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపు, పోలీసులు కరోనా బారినపడుతుండడంతో ఆ శాఖలో కలకలం రేగింది. చాలామంది పోలీసులు లాంగ్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.