నిశ్చితార్థం జరిపి కరోనా తెచ్చుకున్నారు... హైదరాబాదులో మరో క్లస్టర్ కేసు

After engagment fifteen members tested corona positive
  • మే 11న ధూల్ పేట్ లో నిశ్చితార్థం
  • పెళ్లికొడుకు కుటుంబ సభ్యులకు కరోనా
  • కరోనాతో పెళ్లికొడుకు తండ్రి మృతి!
హైదరాబాదులో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. నిన్న ఓ అపార్ట్ మెంట్ లో పాతికమందికి కరోనా సోకిందన్న విషయం తీవ్ర చర్చనీయాంశంగా ఉండగానే, నేడు ఓ కుటుంబంలో 15 మందికి కరోనా నిర్ధారణ కావడం అధికార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవలే ఓ పెళ్లి నిశ్చితార్థం జరిపిన పెళ్లికొడుకు కుటుంబంలో 15 మంది కరోనా బారినపడ్డట్టు గుర్తించారు. ఈ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి (58) కరోనాతో శనివారం నాడు మరణించడంతో ఈ కేసులన్నీ వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థం మే 11న హైదరాబాదులోని ధూల్ పేట్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి లాక్ డౌన్ నిబంధనలు, భౌతికదూరం సూచనలు పక్కనబెట్టి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరైనట్టు సమాచారం. ఇప్పుడు వారందరి వివరాలు సేకరించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Go Back to Shorts
Corona Virus
Family
Engagement
Hyderabad
GHMC
Telangana

More Telugu News