కోవిడ్-19 తర్వాత నిరుద్యోగ, నిరుపేద భారతం: అర్థర్ డి.లిటిల్ నివేదికలో వెల్లడి
- దేశంలో 13.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు
- మళ్లీ పేదరికంలోకి 12 కోట్ల మంది
- 7.6 శాతం నుంచి 35 శాతానికి నిరుద్యోగిత
2021-2022లో వృద్ధి రేటు 0.8 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ‘భారత్: కోవిడ్-19తో ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడం: కోవిడ్-19 అనంతరం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, శక్తిమంతం చేయడానికి 10 పాయింట్ల కార్యక్రమం’ పేరుతో రూపొందించిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది. నిరుద్యోగం ప్రస్తుతం ఉన్న 7.6 శాతం నుంచి 35 శాతానికి పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా 13.5 కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని తెలిపింది. మొత్తంగా 17.4 కోట్ల మంది నిరుద్యోగులుగా మారతారని, 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకోగా, 4 కోట్ల మంది నిరుపేదలుగా మారతారని అర్థర్ డి.లిటిల్ అంచనా వేసింది.