హైదరాబాదులోని నాలుగు జోన్లలో తప్ప రాష్ట్రంలో కరోనా కేసుల్లేవు: సీఎం కేసీఆర్
- కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష
- లాక్ డౌన్ యథావిధిగా అమలు చేయాలని స్పష్టీకరణ
- కేంద్రం మార్గదర్శకాల అనంతరం రాష్ట్ర వ్యూహం ఖరారు
కరోనా నివారణ చర్యలు తీసుకుంటూనే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పలు దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారితో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విమానాల ద్వారా వచ్చే తెలంగాణ వాసులకు, రైళ్ల ద్వారా వచ్చే వలస కార్మికులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని, వైరస్ ఉంటే ఆసుపత్రికి, లేకపోతే హోం క్వారంటైన్ లో ఉంచాలని స్పష్టం చేశారు.