సైకిల్ పై 1000 కిలోమీటర్ల ప్రయాణం... మార్గమధ్యంలో అన్నం కోసం ఆగితే కారు ఢీకొని మృతి!

Migrent Worker Killed in Accident in Meals Break
  • న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన అన్సారీ
  • 500 కిలోమీటర్ల ప్రయాణం తరువాత ప్రమాదం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
తన స్వగ్రామానికి చేరేందుకు 1000 కిలోమీటర్ల ప్రయాణాన్ని సైకిల్ పై ప్రారంభించిన ఓ యువకుడు, మార్గమధ్యంలో అన్నం తినేందుకు ఆగిన వేళ, ఓ కారు వచ్చి ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన లక్నోలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఏడుగురు స్నేహితులతో కలిసి సగీర్ అన్సారీ (26) తన స్వస్థలమైన బీహార్ లోని తూర్పు చంపారన్ కు న్యూఢిల్లీ నుంచి ఈ నెల 5న ప్రయాణం ప్రారంభించాడు. ఐదు రోజుల్లోవారంతా  సగం దూరం ప్రయాణించారు. మార్గమధ్యంలో లక్నో శివార్లలో భోజనం కోసం ఆగారు. రోడ్డు విభాగిని (డివైడర్)పై కూర్చుని అన్నం తింటుండగా ఓ కారు అదుపుతప్పి వచ్చి ముందుగా అన్సారీని ఢీకొంది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అన్సారీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రోడ్డు విభాగినిపై ఉన్న ఓ చెట్టు కారుకు అడ్డుపడడం వల్ల మిగతా వారు బతికిపోయారు. బాధితుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని వెల్లడించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Road Accident
Lockdown
Journey
Bihar

More Telugu News