- అనారోగ్యంతో చింతమనేని కేశవరావు మృతి
- కేశవరావు మృతి పట్ల పలువురి సంతాపం
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శ
ఏపీ టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ తండ్రి కేశవరావు మృతి చెందారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన మృతి చెందినట్టు సమాచారం. కాగా, కేశవరావు మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేశ్, మాగంటి బాబు తదితరులు సంతాపం తెలిపారు. చింతమనేనిని ఫోన్ లో పరామర్శించిన వెంకయ్యనాయుడు, చంద్రబాబులు తమ సానుభూతి తెలిపారు.