నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ పై విచారణ ఎల్లుండికి వాయిదా
- పిటిషనర్ తరఫు వాదనలు విన్న హైకోర్టు
- ఇవాళ ఐదు గంటల పాటు విచారణ
- ఎల్లుండి వాదనలు వినిపించనున్న ప్రభుత్వం, ఈసీ
ఎస్ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డ తొలగింపు రాజ్యాంగవిరుద్ధమని, ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కొట్టివేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో, వాదనలు వినిపించేందుకు ప్రభుత్వానికి ఒకరోజు సమయం ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ప్రభుత్వం, ఈసీ తరఫు న్యాయవాదులు గురువారం నాడు తమ వాదనలు వినిపించనున్నారు. శుక్రవారం సాయంత్రానికి ఈ వ్యవహారంలో విచారణ పూర్తయ్యే అవకాశముందని తెలుస్తోంది.