బెంగళూరు నుంచి 22 విమానాల ద్వారా 3 వేల మంది విదేశీయుల తరలింపు!
- లాక్ డౌన్ కారణంగా భారత్ లో చిక్కుకుపోయిన విదేశీయులు
- మార్చి 31న జర్మనీకి బయల్దేరిన తొలి విమానం
- మొత్తం 17 దేశాలకు విదేశీయుల తరలింపు
విదేశీయులతో కూడిన తొలి విమానం మార్చి 31న జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు వెళ్లిందని అధికారులు తెలిపారు. ఈ విమానంలో వెళ్లినవారిలో ఎక్కువ మంది టోక్యోకు చెందినవారు ఉన్నారని చెప్పారు. లండన్, మాలె, మస్కట్, దోహా, కొలంబో, కైరో, బాగ్దాద్, అజర్బైజాన్, ఇంచేన్, రోమ్, స్టాక్ హోమ్, రియాద్, పారిస్, పరొ తదితర నగరాలకు విమానాలు వెళ్లాయని తెలిపారు. వీటిలో ఇంచేన్, రోమ్, పరొ, కైరో, బాగ్దాద్, అజర్బైజాన్, స్టాక్ హోమ్ నగరాలకు బెంగళూరు నుంచి తొలిసారిగా విమానాలు నడిచాయని చెప్పారు.