గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ క్లినిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి: సీఎం జగన్

CM Jagan said village clinics will play key role
  • కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష
  • ల్యాబ్ లు లేని జిల్లాల్లో వెంటనే ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని సూచన
  • నిన్న ఒక్కరోజే 6,928 పరీక్షలు చేసినట్టు సీఎంకు తెలిపిన అధికారులు
ఏపీ సీఎం జగన్ ఇవాళ సమీక్షా సమావేశాలతో బిజీగా ఉన్నారు. కొవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ క్లినిక్స్ కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. కరోనా ల్యాబ్ లు లేని జిల్లాల్లో వెంటనే ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు సీఎంకు కరోనా నివారణ చర్యల గురించి వివరించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 6,928 పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు 61,266 పరీక్షలు జరిపినట్టు సీఎంకు నివేదించారు.

కాగా, సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలపైనా సమీక్ష చేపట్టారు. పాఠశాలల్లో ఫర్నీచర్, చాక్ బోర్డులు తదితర వస్తు సామగ్రి కోసం టెండర్లు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా, వచ్చే విద్యాసంవత్సరానికి గాను స్కూలు పిల్లలకు ఇవ్వనున్న యూనిఫాం దుస్తులు, స్కూలు బ్యాగుల నమూనాలను సీఎం జగన్ పరిశీలించారు. ఆపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Go Back to Shorts
Jagan
Corona Virus
Andhra Pradesh
Review
Village Clinics

More Telugu News