Kamal Haasan: ‘కరోనా’పై అవగాహన కల్పిస్తూ కమలహాసన్ పాట!
‘కరోనా’ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రముఖ నటుడు కమలహాసన్ ఓ పాట రాశారు. అంతే కాదు, ఆ పాటను స్వయంగా కమల్ పాడారు. జిబ్రాన్ సంగీతం అందించారు. కమల్ తో పాటు ఆయన కుమార్తె శ్రుతిహాసన్, సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, అనిరుథ్, బొంబాయి జయశ్రీ, శంకర్ మహదేవన్, సిద్ధార్థ్, ఆండ్రియా తదితరులు ఆలపించారు.