ఏసీలను నిత్యావసరాల జాబితాలో చేర్చిన పంజాబ్ కు కేంద్రం అక్షింతలు!
- ఏసీలు, కూలర్లు నిత్యావసరాలుగా పేర్కొన్న పంజాబ్
- కేంద్రం మార్గదర్శకాలు తప్పక పాటించాలన్న సుప్రీం
- పంజాబ్ సర్కారుకు లేఖ రాసిన కేంద్ర హోంశాఖ
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కూడా తీవ్రంగా స్పందిస్తూ లేఖ రాశారు. దాంతో పంజాబ్ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కితీసుకుంది. అటు, కేంద్ర హోంశాఖ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. కేరళలో కొన్నిజోన్లలో నిబంధనలు సడలించడాన్ని ప్రశ్నించింది.
కాగా, కేరళలో పలు జోన్లలో ప్రైవేటు వాహనాలకు, హోటళ్లకు అనుమతి ఇచ్చారు. మరికొన్ని జోన్లలో వర్క్ షాపులు, బార్బర్ షాపులు, ఇద్దరు ప్రయాణికులతో కార్లకు అనుమతి ఇచ్చారు. అంతేకాదు స్వల్ప దూరాలకు బస్సు ప్రయాణాలకు సైతం పచ్చజెండా ఊపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి లేఖ వచ్చినట్టు అర్థమవుతోంది.