లాక్ డౌన్ రోజుల్లో గృహ హింస పెరగడంపై సానియా ఆందోళన
- ఆన్ లైన్ సదస్సు నిర్వహించిన 'ఇండియాటుడే' మీడియా సంస్థ
- మహిళా సమస్యలపై ఎలుగెత్తిన సానియా
- ఆలోచన ధోరణి మారాలని సూచన
"లాక్ డౌన్ సందర్భంగా మహిళలపై దాడులు, గృహ హింస పెరుగుతున్నట్టు వస్తున్న వార్తలు నా దృష్టికీ వచ్చాయి. దీన్ని నేను ఎల్లప్పుడూ ఖండిస్తాను. గృహ హింస అనేది ఒక అసంబద్ధమైన విషయం. లాక్ డౌన్ రోజుల్లో పురుషులు, మహిళలు అందరూ సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆలోచనా ధోరణి మారితే చాలు. అయితే తమకు లభించాల్సిన గౌరవం కోసం శాసించి, సాధించాల్సిన బాధ్యత మహిళలపైనే ఉంది" అని అభిప్రాయపడ్డారు.