పాపం కానిస్టేబుల్‌...మాస్క్‌ పెట్టుకోలేదని చితక్కొట్టిన అధికారి!

  • ఎస్‌హెచ్‌ఓ, కానిస్టేబుల్‌ మధ్య వివాదం
  • ఆ సందర్భంగా తనను కొట్టినట్టు కానిస్టేబుల్‌ ఆరోపణ
  • ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌ ప్రాంతంలో ఘటన
మాస్క్‌ విషయమై అధికారికి, కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన వాగ్వాదం సందర్భంగా సదరు అధికారి కానిస్టేబుల్‌ను చితక్కొట్టిన ఘటన వెలుగు చూసింది. ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

దుర్గాచౌక్‌ వద్ద జోగేంద్ర అనే కానిస్టేబుల్‌తోపాటు మరికొందరు పోలీసులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ ప్రకాష్‌ మాస్క్‌ ధరించని జోగేంద్రను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది.

ఆ సమయంలో ఎస్‌హెచ్‌ఓ తనను లాఠీతో తీవ్రంగా కొట్టినట్లు సదరు కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు ఓ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
New Delhi
constable
SHO

More Telugu News